అంగన్వాడీ పిల్లలకు వార్డు సభ్యుడు 20 కుర్చీలు అందజేత...

అంగన్వాడీ పిల్లలకు వార్డు సభ్యుడు 20 కుర్చీలు అందజేత...

ముద్ర, మల్యాల: మల్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 16 వార్డు లొ గల అంగన్వాడీ చిన్నారులకు శుక్రవారం స్థానిక వార్డు సభ్యులు మిట్టపల్లి దశరథo ఉచితంగా 20 చిన్న కుర్చీలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయనకు అంగన్వాడీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలొ అంగన్వాడీ సూపర్వైజర్ రాజశ్రీ, కార్యకర్త స్వప్న, నాయకులు ఎండీ దాదా సాహెబ్, కొక్కుల రఘుబాబు, భోగ రాజు, మీస రమేష్, అర్జున్, నారాయణ, బుదారపు రాజు, కొక్కుల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.  కాగా, తన నాలుగున్నర ఏళ్ల పదవి కాలంలొ దశరథo సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ సహకారంతొ 30 లక్షలకు పైగా అభివృద్ధి పనులను వార్డులొ చేపట్టడం పట్ల కూడా పలువురు అభినదించారు.