కోరుట్ల లో కౌన్సిలర్ భర్త పై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి..

కోరుట్ల లో కౌన్సిలర్ భర్త పై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి..

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారి పక్కన వందలాది మంది చూస్తుండగా కోరుట్ల పట్టణ కౌన్సిలర్ భర్త పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తి తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కౌన్సిలర్ భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు...స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణ 9 వ వార్డు కౌన్సిలర్ పోగుల ఉమా రాణి భర్త లక్ష్మి రాజం మంగళవారం ఉదయం పట్టణంలోని సీ ఎస్ ఐ చర్చ్ వద్ద ఉన్న హొటల్ లో చాయ్ తాగుతూ ఉండగా  ద్విచక్ర వాహనంపై  వచ్చిన గుర్తు తెలియని దుండగులు లక్ష్మి రాజం పై ఒక్కసారిగా కత్తి తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.గాయాలపాలైన లక్ష్మి రాజం ను స్థానికులు పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ఆసుపత్రి కి తరలించారు.చికిత్స పొందుతూ లక్ష్మి రాజం మరణించాడు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ హత్యలో పాత్రధారిగా అనుమానిస్తూ ఓ రౌడీ షీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.హత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.