నేను కాంగ్రెస్‏లోకి వెళ్తానని ప్రకటించానా..?

నేను కాంగ్రెస్‏లోకి వెళ్తానని ప్రకటించానా..?

బెంగళూరు: 'కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తానని నేనెక్కడైనా ప్రకటించానా..? కనీసం ఎవరితోనైనా మాట్లాడానా..?' అంటూ వసతి శాఖ మంత్రి సోమణ్ణ  మండిపడ్డారు.  బెంగళూరు గోవిందరాజనగర్‌లో సోమవారం విజయసంకల్ప యాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వదంతులకు సమాధానాలు చెప్పలేనన్నారు. ఎవరో చేసే వ్యాఖ్యలకు తానెందుకు స్పందించాలని ప్రశ్నించారు. పార్టీలోనే ఉన్నానని, ఇక్కడే కొనసాగుతానని స్పష్టం చేశారు. విజయసంకల్ప యాత్రలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి అశోక్‌ మాట్లాడుతూ మంత్రి సోమణ్ణకు ఎటువంటి అసంతృప్తి లేదన్నారు.  తాను, సోమణ్ణ కలిసే ఉన్నామని, మా మధ్య విబేధాలకు తావు లేదన్నారు. కాంగ్రెస్​లోకి  వెళ్తారంటూ అనవసర ప్రచారం చేశారన్నారు. దక్షిణ భారత్‌కు కర్ణాటక ప్రధాన ద్వారం లాంటిదన్నారు. ఇక్కడ తామే గెలుస్తామని, మరోసారి తమదే అధికారమని దీమా వ్యక్తం చేశారు.