కెసిఆర్ సభ విజయవంతం చేయాలి.. బిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ భూక్య నాగు నాయక్

కెసిఆర్ సభ విజయవంతం చేయాలి.. బిఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ భూక్య నాగు నాయక్

ముద్ర, చివ్వెంల : సీఎం కేసీఆర్ సభ విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నుంచి ఒక ప్రకటన విడుదల చేసినారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ భుక్య నాగు నాయక్   మాట్లాడుతూ ఈనెల 20న సూర్యాపేటలో జరిగే కెసిఆర్ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని, మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించి అనంతరం బహిరంగ సభ పాల్గొంటారని తెలిపారు. సుమారు మండలం నుంచి 5000 మందిని సభకు వచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీ లో బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రతి నాయకులు కృషి చేయాలని, ప్రతి గ్రామా నుంచి సుమారు 100 మంది అదేవిధంగా చూడాలన్నారు.