సింగరేణి  ఎన్నికలు వాయిదా!

సింగరేణి  ఎన్నికలు వాయిదా!

డిసెంబర్ 27న నిర్వహించాలంటూ హైకోర్టు తీర్పు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. గతేడాది నుంచి హై కోర్టులోనే సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడగిస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23 న సింగరేణి ఎన్నికలపై  హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై సింగరేణి యాజమాన్యం చీఫ్ కోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైకోర్టులో వాదనలను విన్న హైకోర్టు డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.