బీజేపీకి కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీశ్రావు
![బీజేపీకి కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీశ్రావు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64005479f0712.jpg)
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం మోం చేసిందదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్కేసర్లో బీఆర్ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత యూపీఏ హయాంలో గ్యాస్పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు.