ఆడబిడ్డ పెండ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత

ఆడబిడ్డ పెండ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తూ ఆడబిడ్డలకు పెళ్ళికానుకగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్  పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్నాడని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత అన్నారు. శనివారం మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ కార్డు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని. గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.