ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
![ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్](https://mudranews.in/uploads/images/2024/01/image_750x_659f94c5d3248.jpg)
ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడీ ప్రారంభం కానుంది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడీ ప్రారంభం కానుంది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం.
ఈ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక నేటి నుంచి ఈ నెల 18 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు సంబంధించిన నామినేషన్ ల గడువు కొనసాగనుంది. అలాగే.. ఈ నెల 29న ఎన్నిక, అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. కాగా ఎమ్మెల్సీలుగా ఉన్నటు వంటి కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ తరుణంలోనే.. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం.