ఘనంగా చండికా అమ్మవారి ప్రతిష్టాపన

ఘనంగా చండికా అమ్మవారి ప్రతిష్టాపన
chandi ammavaru

ముద్ర ప్రతినిధి, జనగామ: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చండీకా అమ్మవారి ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీసీపీ సీతారాం తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.