నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

జనగామ టౌన్, ముద్ర: నేడు జనగామ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌‌ శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై సర్వే నిర్వహించేందుకు జిల్లా అధికారులు మండలాలకు ప్రత్యేక అధికారులు నియమించినట్టు పేర్కొన్నారు. సర్వే కోసం వారు గ్రామాలకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీనిని సహకరించాలని కోరారు.