కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు..

కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు..
  • సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ఫైళ్ళ

ముద్ర ప్రతినిధి భువనగిరి :కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని...  సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని  భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం నందనం, నాగిరెడ్డిపల్లి, నమాత్ పల్లి ఎర్రంబెల్లి  గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు  విశ్వసిస్తున్నారని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కెసిఆర్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, కెసిఆర్ ను మళ్ళీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ప్రతి గడపకు సంక్షేమం,అభివృద్ది అందించిన బి ఆర్ ఎస్ ను రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.