కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: సింగపురం ఇందిర

కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: సింగపురం ఇందిర

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: టూరిస్టులను తరిమికొట్టి స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. ఆదివారం మండలంలోని అక్కపల్లిగూడెం, కొమటిగూడెం, రంగరాయగూడెం, ఇప్పగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గ ప్రజలే నా బలం, బలగమని అన్నారు. నేను ఈ నియోజకవర్గ బిడ్డను నా బలగం అంతా ఈ నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు.

నియోజకవర్గానికి టూరిస్టులుగా వస్తున్న ఇతర ప్రాంతాల నాయకులను ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తరిమికొడతారని అన్నారు. స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి నా నియోజకవర్గ ప్రజల బలమెంటో చూపిస్తాని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, కాసాని బోందయ్య, నాగరబోయిన శ్రీరాములు, చెవుల యాదగిరి, లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మేకల మల్లేషం, సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, రడపాక రాజ్ కుమార్, మహేందర్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.