బీఆర్ఎస్ కు ఓటుతొ గుణపాఠం చెప్పండి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

బీఆర్ఎస్ కు ఓటుతొ గుణపాఠం చెప్పండి  - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర, మల్యాల: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మీ ఓటుతొ గుణపాఠం చెప్పాలని  పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని బల్వoతాపూర్ గ్రామంలొ ఆదివారం నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలొ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలొ మండలం చాలా అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రెండు సార్లు ఓటమి చెందినప్పటికీ, నిరుత్సాహపడకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని పోరాటం చేస్తున్న తనను ఈ సారి ఆశీర్వదిoచాలని సత్యం విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు యువకులు, పెద్దలు, మహిళలు కాంగ్రెస్ లొ చేరడానికి రాగ, జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కార్యక్రమంకు వచ్చిన జీవన్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఆనందరెడ్డి, మాజీ జడ్పీటీసీలు దారం ఆదిరెడ్డి, శోభారాణి, యువజన నాయకులు ముత్యం శంకర్ గౌడ్, కంచెర్ల లక్ష్మణచారీ, నేరెళ్ల సతీష్ రెడ్డి, తాళ్ల హరినాథ్, శనిగారపు తిరుపతి, కొను లక్ష్మణ్, నరసింహరెడ్డి, నల్ల తిరుపతి, నారాయణ, వినయ్, తదితరులు పాల్గొన్నారు.