నలుగురి పోలీసుల పై సస్పెన్షన్ వేటు

నలుగురి పోలీసుల పై సస్పెన్షన్ వేటు

జమ్మికుంట, ముద్ర:  జమ్మికుంట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ మరియు ముగ్గురు పిసిలను కమిషనర్ ఆఫ్ పోలీస్  ఎల్ సుబ్బారాయుడు గారు సస్పెండ్ చేసినారు.  వివరాల్లోకెళితే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న  NM. నాగ వెంకట్ రెడ్డి HC 1752,  తిప్పారపు విద్యాసాగర్ PC 2484 ,అప్పల సత్యనారాయణ PC 3210 ,ఎండి రహీం PC 223 లు గత కొంతకాలంగా విధుల పట్ల అలసత్వం మరియు నిర్లక్ష్యం వహించి పై అధికారుల సూచనలు పాటించకపోవడంతో తగు విచారణ అనంతరం నివేదిక అందిన పిదప వీరందరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేసినారు.

ఇందులో HC 1752 నాగ వెంకట్ రెడ్డి పై జోన్ 3 రాజన్నజోన్ DIG గారికి తగు చర్య నిమిత్తం నివేదిక పంపనయినది. ఈ సందర్భంగా కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరు   డ్యూటీ పట్ల విధేయతతో ఉండి, విధులు నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని, ఏమాత్రం క్రమశిక్షణ తప్పిన, విధుల పట్ల అలసత్వం వహించిన సహించేది లేదని హెచ్చరించినారు.