ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తాం: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తాం: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
  • సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం మానుకోవాలి..
  •  అక్రమ కేసులను ఎదుర్కొనే సత్తా ఉంది.. నాగం

 నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: రాష్ట్రంలోని 33 జిల్లాలలో 20 జిల్లాలకు పైగా రైతులు అకాల వర్షానికి సతమతమవుతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు సమ్మేళనాల పేరుతో రాజకీయ లబ్ధికి ఎత్తిస్తున్నారని వెంటనే రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ కండువాను వేసుకోవాలని కోరుతున్నారని అలా చేసిన వారికి సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తున్నారని పోస్ట్ చేస్తే కేసులు నమోదు చేశారని మరి తనపై సోషల్ మీడియాలో ఆ పార్టీకి చెందిన అనేకమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్న పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలోని ఎమ్మెల్యేల మంత్రుల అవినీతి అక్రమాలను ఆధారాలతో అందిస్తాను వారిపై చర్య తీసుకునే దమ్ము ముఖ్యమంత్రి కి ఉందా అని ప్రశ్నించారు. కృత్తిమంగా ఇసుకను తయారు చేయడం నేరమని సొంత వ్యవసాయ పొలంలో కూడా ఇసుకను తరలించవద్దని నిబంధన ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రజాధనంతో ఉద్యోగులకు 5000 కోట్ల రూపాయల జీతాలను చెల్లిస్తున్నారని ఉద్యోగులు మాత్రం అధికార పార్టీకి బానిసలుగా పని చేస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని అన్నారు పోలీసుల తీరుపై ఎస్పీ కార్యాలయం ముందు బయట ఇస్తానని హెచ్చరించారు సేవలు అందించడంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి బాలా గౌడ్ పాండు లక్ష్మయ్య నారాయణ గౌడ్ అహ్మద్ పాషా సత్యం చంటి తదితరులు పాల్గొన్నారు.