కాంగ్రెస్ పార్టీలో చేరిక 

కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి  నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమము ఆదివారం  28వ వార్డు జే.జే నగర్ లో జరిగింది.

ఈ సందర్భంగా శనగాని రాంబాబు గౌడ్, రాచకొండ దేవయ్య, బైరు మహేష్ ఆధ్వర్యంలో 28వ వార్డుకు చెందిన ఎల్గురి వెంకటేష్, మునుగోటి నర్సయ్య, గంగరబోయిన సైదులు,నగేష్, జాని,జావేద్, పాశం వీరయ్య, కందికంటి వెంకన్న,చింత శ్రీను,మని,వెంకటేష్, మరగాని రవి,B.R.S పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి T.P.C.C రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి  పార్టీ కండువాలు అలంకరించి సాదరంగా ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం గౌరవం దక్కుతుందని ప్రతివారు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, పట్టణంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గడపగడపకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనూహ్యా స్పందన వస్తుందని కేంద్రంలో రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ రాజ్యమన్నారు  ఈ సందర్భంగా మాట్లాడిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.