వర్షంలోనూ పంచాయతీ కార్మికుల నిరసన

వర్షంలోనూ పంచాయతీ కార్మికుల నిరసన

ముద్ర, మల్యాల:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం మల్యాలలో పంచాయతీ కార్మికులు వర్షంలోనూ నిరసన కొనసాగించారు. 14 వ రోజు సమ్మెలో సీఐటీయూ కొరేపు మల్లేశం అధ్యక్షుడు మాట్లాడుతూ రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ న్యాయపరమైన డిమాడ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి కార్మికులు గొడుగులు పట్టుకొని సమ్మె నిర్వహించారు. కార్మిక సంఘ నాయకులు దేవమ్మ, శ్రీను, సుదర్శన్, మల్లేశం, రాజు, సభ్యులు గంగారాం, పోచయ్య, సురేష్, కాంతవ్వ, శాంతమ్మ, గంగోత్రి, లక్ష్మి, గుడిసె లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.