అధిక మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించాలి - బిఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం

అధిక మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించాలి - బిఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం

ముద్ర నవంబర్ 5 ఎల్లారెడ్డిపేట : అధిక మెజారిటీతో మంత్రి కేటీఆర్ ను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లతో అన్నారు. ఆదివారం రోజు ఎల్లారెడ్డిపేట  మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాలలో ముమ్మనంగా ప్రచారాన్ని చేపట్టారు. స్థానిక మంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ మంత్రి కేటీఆర్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని,రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంత్రి కేటీఆర్ మన ముందు ఉన్నాడని కావున ప్రతి ఒక్కరు కార్ గుర్తుకే ఓటు వేసి గెలిపించుకుందామని ఓటర్లతో అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చీటీ  లక్ష్మణరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి, మాజీ డైరెక్టర్ అండ్ సుభాష్, పిల్లి కిషన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.